టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్లో సంచలన కామెంట్స్ పెట్టి పొలిటికల్ హీట్ ను తారా స్థాయికి తీసుకెళ్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న టీడీపీకి సొత పార్టీలో కుమ్మలాటల ఇబ్బందిగా మారాయి. విజయవాడలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల మధ్య ట్వీట్ వార్ మరింత ముదిరింది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటూ.. పొలిటికల్ హీట్ పెంచారు. ఇద్దరు నేతలు పదునైన ట్వీట్స్‌తో దుమారం రేపుతున్నారు. 


తాజాగా కేశినేని బుద్దా వెంకన్నపై ఘాటు ట్వీట్ చేశారు. ‘రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు.. గుళ్ళో కొబ్బరిచిప్ప దొంగలకి, సైకిల్ బెల్లుల దొంగలకి,కాల్ మనీ గాళ్ళకి, సెక్స్ రాకెట్ గాళ్ళకి, బ్రోకర్లకి, పైరవిదారులకి అవసరం. నాకు అవసరం లేదు’అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. అలాగే ట్వీట్ కూడా చేశారు. నాని చేసిన ఈ ట్వీట్ మరోసారి సంచలనంగా మారింది. 


టీడీపీలో ఈ ఇద్దరు నేతల మధ్య ట్వీట్ వార్ ముదురుతోంది. గతంలో ఈ ఇద్దరు నేతలు పార్టీ కోసం కలిసి పనిచేశారు.. సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వెంకన్న కూడా నాని వెంట ఉండేవారు.. తర్వాత బుద్దా చంద్రబాబుకి దగ్గరయ్యారు. ఆయనకు నాలుగు పదవులు దక్కాయట. అప్పటి నుంచి నాని, ఎమ్మెల్సీ మధ్య విభేదాలు మొదలయ్యాయని బెజవాడ టాక్. నాని ఇలా సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం మొదలయ్యింది. మరి ట్వీట్ వార్‌కు అధినేత ఎలా బ్రేకులేస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: