ఆంధ్ర ప్రదేశ్ విజయవాడలో ఓ కార్యకర్తకు కాళ్ళు కడిగి ఆ నీళ్లను నెత్తిన చల్లుకున్నాడు మాజీ సీఎం. కంగారు పడకండి మాజీ సీఎం అంటే మన ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు కాదు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ లెండి ఈ పని చేసింది. విజయవాడలోని బీజేపీ కార్యకర్త దోగిపర్తి శ్రీనివాసరావు దంపతులు కాళ్ళు కడిగారు. 


అవునండీ నిజమే ఓ కార్యకర్త కాళ్ళను సీఎం కడిగాడు. కడగడమే కాదు ఆ నీటిని తన నెత్తిపై చల్లుకున్నాడు శివరాజ్ సింగ్ చౌహన్. ఈ పని ఎందుకు చేసారంటే బీజేపీ కోసం కస్టపడి పనిచేసే కార్యకర్తలను సన్మానించుకోవడం తన అదృష్టమని శివరాజ్ సింగ్ చౌహన్ చెప్పారు. కాగా గతంలో విజయవాడలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గిన్నాని చెప్పారు. 


శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయ్యిందని, త్వరలో తెలుగు దేశం పార్టీ కూడా భూస్థాపితం అవుతుందని అన్నారు. ఇప్పటికే దేశంలో అతి ఎక్కువ రాష్ట్రాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉందని ఆంధ్ర ప్రదేశ్ లో కూడా బలం పుంజుకుంటుంది అని శివరాజ్ సింగ్ చౌహన్ జోస్యం చెప్పారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: