ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ఒక్కరు ప్రధాని మంత్రి అయినా సరే 'ఆంధ్రప్రదేశ్'కి ప్రత్యేక హోదా ఇవ్వలేరని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీలో ఉన్న సుజనా చౌదరి ఇప్పుడు పార్టీ మారి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.


కేంద్రం ఏ రాష్ట్రంపై కక్ష సాధించదని, గత ప్రభుత్వం చంద్రబాబు పాలనలో అభివృద్ధి పక్కదారి పట్టిందని సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చూసిన నెటిజన్లు సుజనా చౌదరిపై మాములుగా కామెడీ చెయ్యడం లేదు. సుజనా తిన్నావా రా అంటూ ఫోటోలు ఎడిట్ చేసి సుజనా చౌదరికి చుక్కలు కనిపించేలా చేస్తున్నారు నెటిజన్లు. 


నెటిజన్లు పెట్టిన కామెంట్లలో ఎక్కువగా 'సుజనా ఏమైందిరా ? ఎందుకు రా ప్రత్యేక హోదా రాదు అని అంటున్నవ్ ? అంటూ కింద క్యాప్షన్ లో భూతులు తిడుతున్నారు నెటిజన్లు. మరికొంతమంది నెటిజన్లు పదవి బలం కోసం పార్టీ మారిన నువ్వా మాట్లాడేది అంటూ పోస్ట్ చేశారు. ఏది ఏమైనప్పటికి తెలుగు దేశం పార్టీ నేతలు పార్టీ కోసం చాలా చాలా కష్టపడుతున్నారు అందుకే వాళ్ళపై వాల్లే సెటైర్లు వేసుకుంటున్నారు. టీడీపీ పరువు టీడీపీ వాల్లే తీస్తున్న సమయంలో టీడీపీ మాజీ ఎంపీ తీసేది చంద్రబాబుకు పెద్ద అవమానం కాదులే అని అంటున్నారు నెటిజన్లు.



మరింత సమాచారం తెలుసుకోండి: