నువ్వు దొంగంటే కాదు నువ్వే కాల్ మనీ సెక్స్ రాకెట్ లో బ్రోకరవి....అంటూ టిడిపి నేతలు ఒకళ్ళ వ్యవహారం మరొకళ్ళు బయట పెట్టేసుకుంటున్నారు. పార్టీకి ఆయువు పట్టులాంటి కృష్ణా జిల్లాలో మొదలైన ముసలం మొత్తం పార్టీనే పుట్టి ముంచినా ఆశ్చర్యం లేదన్నట్లుగా సాగుతోంది ఎంఎల్సీ బుద్ధా వెంకన్న, ఎంపి కేశినేని వ్యవహారం.

 

ఆదివారం మొదలైన వీళ్ళద్దరి ట్వీట్ల యుద్ధంతో  ఒకళ్ళు కాల్ మనీ సెక్స్ రాకెట్ తదితరాల్లో బ్రోకర్ గాను ఇతర వ్యవహారాల్లో కీలక పాత్రదారిగా బయటపడింది. అలాగే దొంగ పర్మిట్లు, దొంర రశీదులతో ఎంపి ఎలా మోసం చేసింది బయటపడింది. మొత్తానికి సంతకు పోతే పాత రంకులన్నీ బయటపడిందనే సామెతలో లాగ టిడిపి నేతల అవినీతి పురాణం బయటపడుతోంది.

 

 

మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమికి టిడిపి కుదేలైంది. దాంతో పార్టీకి భవిష్యత్తు లేదన్న ఉద్దేశంతోనే చాలామంది నేతలు బిజెపిలో చేరిపోతున్నారు. ఏ రోజు ఏ నేత టిడిపికి రాజీనామా చేస్తారో తెలీక చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరిగిపోతోంది. పార్టీ మారకుండా నేతలను ఆపాలని చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నా వాళ్ళెవరూ ఆగటం లేదు. ఒకవైపు వలసలతో చంద్రబాబు ఇబ్బంది పడుతుంటే మరోవైపు నేతల మధ్య వివాదాలు మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా మారిపోతోంది చంద్రబాబు పరిస్ధితి.

 

నేతల మధ్య ఇంతకాల నివురుగప్పినట్లుగా ఉన్న వివాదాలు ఒక్కసారిగా రోడుమీద పడుతున్నాయి. వీళ్ళిద్దరి మధ్య మొదలైన ట్వీట్ల యుద్ధం వెనుక జిల్లాలో నేతలు రెండుగా చీలిపోయారన్నది బహిరంగ రహస్యం. దాంతో ఎవరిని మందలించాలని ప్రయత్నించినా ఎవరు ఎలా రియాక్టవుతారో తెలీక చంద్రబాబు తల పట్టుకున్నారు. ఈ ముసలం ఎక్కడికి దారితీస్తుందో చూడాల్సిందే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: