తిరుమల తిరుపతి లో ఇవాళ శ్రీవారిని దర్శించుకున్న ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ రేవంత్ రెడ్డి గారు తన పై వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దు అంటు కోరారు. కాంగ్రెస్ ను వీడి బీజేపీ లో చేరబోతున్నారని కొద్ది రోజులు గా తనమీద ప్రచారం జరుగుతోంది. ఆయన కాషాయ కండువా కప్పు కుంటారని వార్తలొచ్చాయ్ ఈ క్రమంలో ఈ విషయంపైన ఆయనే స్వయంగా  కీలక ప్రకటన చేశారు తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

తనపై జరుగుతున్న ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మద్దు అని  తనను కాంగ్రెస్ లో ఉన్నందుకే ప్రజలు గెలిపించారు కావున తను వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయనని తను హస్తాన్ని వీడే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: