టీడీపీ పరిస్థితి అతి దారుణంగా తయారైంది. బాబుగోరు ఎంత బుజ్జగించినప్పటికీ  తెలుగు తమ్ముళ్లు మాత్రం పార్టీ నుండి వెళ్లిపోవడానికే ఇష్టపడుతున్నారు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. చంద్రబాబుకు వయసు అయిపోతుంది..  పార్టీను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే నాయకుడు లేడు, మరో పక్క బీజేపీ రోజురోజుకి బలం పెంచుకునే క్రమంలో  బలమైన ఆర్ధిక శక్తులను ఇప్పటికే  తమలో కలిపేసుకుంది. వీటిన్నటికీ తోడు  మన బాబుగోరు  ఏమో,  మన పప్పు బాబుని టీడీపీ భవిష్య నాయకుడిగా ప్రకటించేస్తున్నారు.  అందుకు అనుగుణంగా  అధికార పక్షాన్ని ఎదిరించేవిధంగా  పప్పును   సిద్ధం చేస్తున్నారు. 


ఈ క్రమంలోనే  పప్పు  పై ప్రత్యేక దృష్టి సారించారట బాబు,  అందుకే ఈ మధ్య  జగన్ పై  ట్విట్టర్ లో ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు పప్పు. కానీ పప్పుగోరికీ   వచ్చిన చిక్కు ఏమిటంటే  ఎంత తీవ్ర స్థాయిలో వైసీపీను అలాగే  జగన్ ను తిడుతున్నా..  పప్పును కనీస స్థాయిలో కూడా  పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. పైగా పప్పు పైనే సెటైర్లు ట్రోల్ల్స్ రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. అయినా, పప్పు మాత్రం కామెడీ చెయ్యడం మానట్లేదు. వైసీపీ పై పప్పును ఆయుధంగా మారుద్దామని బాబుగోరు విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. పప్పు మంచి ఫన్ ను జనరేట్ చేస్తున్నాడు. 


ఇప్పటికైనా బాబు తన పుత్ర వాత్సల్యం కట్టిపెట్టి.. పార్టీని తన తరువాత సమర్ధవంతమైన వ్యక్తి చేతిలో పెడితే.. టీడీపీకి భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే.. పార్టీనే కాల గర్భంలో కలిసిపోతుంది. గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నట్టయితే టీడీపీ పార్టీని  పెద్ద ఎత్తున దెబ్బ తియ్యటానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది. మరో పక్క బాబు పై వైసీపీ నాయకులూ  తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో  బాబు  లోకేశం పై  ప్రేమను కురింపించకుండా.. జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ యువ నేతగా పట్టం కడితే.. టీడీపీ అభిమానుల్లో మళ్లీ ఆశ పుడుతుంది. లేదూ  మన లోకేశమే టీడీపీ నాయకుడు అంటారా.. ఇక బాబుగోరి శకం అలాగే టీడీపీ శకం ముగిసినట్లే.       


మరింత సమాచారం తెలుసుకోండి: