2019 ఎన్నికల ఫలితాల్లో 151 సీట్లతో వైసీపీ భారీగా విజయం సాధించింది. వైసీపీ ఇంత భారీగా విజయం సాధించటానికి పార్టీ కోసం ఎంతో మంది కృషి చేసారు. అలా కృషి చేసిన వారికి జగన్మోహన్ రెడ్డి గారు నామినేటెడ్ పదవుల్ని ఇస్తున్నారు. ముందుగా ఎమ్మెల్యే రోజాగారికి జగన్మోహన్ రెడ్డిగారు ఏపీఐఐసీ చైర్మన్గా నామినేటెడ్ పదవిని ఇచ్చారు. రోజాకు జగన్ కేబినేట్లోనే స్థానం లభించాల్సి ఉన్నా సామాజిక సమీకరణల వల్ల రోజాకు స్థానం లభించలేదు. 
 
వైసీపీ పార్టీ కోసం కృషి చేసిన సినీ నటుడు పృథ్వీ గారికి కూడా ఎస్వీబీసీ భక్తి ఛానెల్ చైర్మన్గా నియమించినట్లు తెలుస్తోంది. మరో నటుడు అలీ తెలుగుదేశం , జనసేన పార్టీల్లో చేరకుండా వైసీపీలో చేరాడు. జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కల్యాణ్ అలీకి సన్నిహితుడైనప్పటికీ అలీ జనసేనను కాదని వైసీపీలో చేరాడు. వైసీపీ పార్టీ తరపున కొన్ని ప్రాంతాలలో ప్రచారం కూడా చేసాడు అలీ. 
 
అలీ పార్టీ కోసం చేసిన కృషికి అలీకి జగన్ గారు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పదవి మాత్రమే కాకుండా ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా కూడా అలీని నియమించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే సినీ ప్రముఖులైన అలీ, పృథ్వీలకు పదవులు రావటంతో పార్టీ కోసం కృషి చేసిన ఇతర సినీ ప్రముఖులకు కూడా త్వరలోనే పదవులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: