ఈ సంవత్సరంలో ఏకంగా 18 వేల మందిని నియమించుకుంటామని ప్రముఖ ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ ప్రకటించింది.అదికూడా క్యాంపస్ రిక్రూట్ మెంట్ మార్గంలో ఎక్కువ నియామకాలు ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ లో ఉన్న ఉద్యోగుల సంఖ్య రెండు లక్షల ముప్పై వేలకు పైగా ఉన్నారు.అదే సమయంలో కంపెనీలు అట్రిషన్ రేటు (ఉద్యోగ వలసలు) కూడా ఎక్కువ గానే ఉండటం గమనార్హం.
ఎందుకనగా ఉద్యోగాల్లొ చేరినవారు ఎక్కువ కాలం కంపెనీల్లో పనిచేయడం లేదు.మరొక ఉద్యోగం చూస్కుని వెళుపోతున్నారు,దీని వల్ల కంపెనీపై ఎలాంటి ప్రభావం ఉండదనే ఇన్ఫోసిస్ పేర్కొంటోంది. ప్రస్తుత జూన్ మొదటి వారంలో దాదాపు ఎనిమిది వేల మందిని నియమించుకున్నామని,వీరిలో ఫ్రెషర్స్ 2500 మంది ఉన్నారని అన్నారు.ఈ ఏడాదిలో పద్దెనిమిది వేల మందిని నియమించుకోవాలని చూస్తున్నారని,ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎవోబీ ప్రవీణ్ రావ్ తెలిపారు.
జూన్ మొదటి వారంలో నాటికి అట్రిషన్ రేటు 23 శాతంగా ఉండగా మార్చ్ మొదట వారంలో అట్రిషన్ రేటు 20 శాతంగా ఉండటం గమనార్హం.సాధారణంగా సంవత్సరం ఆరంభంలో అట్రిషన్ రేటు ఎక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది.అదే సమయంలో ఉద్యోగుల్ని నిలుపుకొనేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.