ప్రపంచం ఓ వైపు టెక్నాలజీ రంగంలో దూసుకు వెళ్తుంటే..దేశంలో మారుమూల గ్రామాల్లో మాత్రం మంత్రాలు..మాయలు అంటూ మూఢ నమ్మకాలను ఇంకా విడిచి పెట్టడం లేదు.  ఇప్పటికే ఊళ్లో దేయ్యాలు ఉన్నాయని..క్షుద్ర పూజలు ఉంటాయని ఆమాయక ప్రజలను మభ్యపెడుతూ దొంగ సాములు డబ్బులు గుంజుతున్నారు. ఇక గుప్త నిధుల విషయానికి వస్తే దారుణంగా మానవ బలులే చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుప్తనిధుల కోసం నరబలి ఇచ్చారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. ఆలయ పూజారితోపాటు ఇద్దరు మహిళల్ని హతమార్చారు.

తనకళ్ళు మండలం కొర్తికోటలో ఈ ఘటన చోటుచేసుకుంది.  కేవలం గుప్త నిధుల కోసం క్షుద్రపూజలు చేసి ముగ్గరుని అత్యంత దారుణంగా చంపేసినట్లు తెలుస్తుంది. ముగ్గురిలో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. వారిని అత్యంత దారుణంగా గొంతుకోసి హత్యచేశారు. చనిపోయిన వారు శివరాక్మిరెడ్డి, హనుమమ్మ, సత్య లక్ష్మీగా గుర్తించారు.  నకళ్ళు మండలంలోని ఫ్యాక్షన్ గ్రామమైన కొర్థికోట గ్రామానికి కాస్తదూరంలో శివాలయం ఉంది.  అక్కడ ఆలయానికి మల్లమ్మ అనే మహిళ ఉండేది.   ఆమె చనిపోయిన తరువాత గుడి నిర్వహణ ఆమె తమ్ముడు  శివరామిరెడ్డి, తండ్రి నారాయణ రెడ్డి ఇద్దరూ చూస్తున్నారు.  అయితే శివరామిరెడ్డికి వంట చేసి..ఇంట్లో పనులు చూసుకోవడానికి ఆయన అక్క కమలమ్మ అక్కడే ఉండేది. 

వీరి ఇంటికి సత్యలక్ష్మి అనే మహిళ చుట్టపు చూపుగా వచ్చింది.  ఈ క్రమంలో సుమారు ఆదివారం రాత్రి పది గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు శివరామిరెడ్డి, కమలమ్మ, సత్యలక్ష్మిను గొంతుకోసి హతమార్చారు. తర్వాత ఆ రక్తంను గుడిలో ఉన్న శివలింగం మీద, గుడి లో ఉన్న పుట్టల మీద చల్లారు. దాంతో అక్కడ గుప్తి నిధుల కోసం క్షుద్ర పూజల కోసం అన్యాయంగా ఈ ముగ్గురిని చంపి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. కాగా, క్షుద్ర పూజల కోసం తమ గ్రామాంలో ఒకేసారి మూడు హత్యలు జరగడంతో స్థానికులంతా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: