అవయవాల అక్రమ రవాణాపై శాశనమండలిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) అవయవాల అక్రమ రవాణాపై ఇప్పటివరకు రెండు కేసులు నమోదయ్యాయని తెలిపారు. అవయవాల అక్రమ రవాణాకు సంబంధించి మంత్రి శాసనమండలిలో మాట్లాడుతూ, అవయవాల అక్రమ మార్పిడిపై విశాఖలోని శ్రద్ధ హాస్పిటల్, నెల్లూరులోని సింహపురి ఆస్పత్రిపై కేసులు నమోదయ్యాయని చెప్పారు.
అవయవ అక్రమ మార్పిడిపై గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. పైగా సింహపురి హాస్పిటల్ కోర్టు కెళ్లే అవకాశాన్ని అధికారులే కల్పించారని మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.
శ్రద్ధ హాస్పిటల్పై చర్యలు తీసుకున్నామని,లైసెన్స్ రద్దు చేసి మూసివేసినట్టు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి ఆళ్ళ నాని వెల్లడించారు.