ఆకాశంలో జరిగే వింతల గురించి మనకు ఎప్పుడూ ఖగోళ శాస్త్రవేత్తలు సమాచారం అందిస్తూనే ఉంటారు.  జులై 16న ఏర్పడే చంద్ర గ్రహాణం దేశంలో కనువిందు చేయనుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలు మినహా దేశంలోని ఎక్కడ నుంచైనా గ్రహణం స్పష్టంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఉత్తరాషాడ నక్షత్రం ధనుస్సు రాశిలో ఏర్పడుతుంది. మంగళవారం రాత్రి 1.34 గంటల నుంచి తెల్లవారుజామున 4.31 గంటల వరకు ఉంటుంది. 

గ్రహణం తృతీయ యామంలో ప్రారంభమవుతుంది కాబట్టి పూజలు, వ్రతాలు, శ్రాద్దకర్మలు, అలాగే నిత్య భోజనాలు మధ్యాహ్నం 1.30 గంటల్లోపు ముగించాలని జ్యోతిషులు తెలియజేస్తున్నారు. గ్రహణం వల్ల ఏలాంటి ఫలితాలు, ఏ రాశులవారు చూడరాదో జ్యోతిషులు తెలియజేస్తున్నారు. సూర్య, చంద్రులతో పాటు శుక్ర, శని, రాహు, కేతు గ్రహాలు ఒకే వృత్తంలో ఉంటాయి. ఇక గురు పూర్ణిమ  రోజున గ్రహణం ఏర్పడం గత 149 ఏళ్లలో ఇదే తొలిసారి.   1870 జులై 12 అర్ధరాత్రి నుంచి 13 తెల్లవారుజాము మధ్య చంద్రగ్రహణం సంభవించింది.

అది కూడా శని, రాహు, కేతువు ధనుస్సు రాశిలో ఉండగా, రాహువుతో కలిసి సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించాడు.  మనః కారకుడు చంద్రుడు కాబట్టి మానసిక ఒత్తిడి లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే పరిహారం చేయాలి. ధనుస్సు రాశిలో గ్రహణం ఏర్పడుతుంది.. కాబట్టి ఆ రాశితోపాటు ఆ రాశికి ముందు వెనుక ఉండే వృశ్చికం, మకర రాశివారు జులై 17న శివుడికి అభిషేకం చేయిస్తే మంచిది. ఒకవేళ అభిషేకం చేయడం కుదరకపోతే ఓం నమశ్శివాయ మంత్రాన్ని 11 లేదా 108 సార్లు పఠిస్తే గ్రహణం ప్రభావం తగ్గుతుంది. 


శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి వార్ల ఆలయాలను చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం సాయంత్రం కాలపూజ చేసి మూసివేస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వాహణాధికారి శ్రీరామచంద్రమూర్తి తెలిపారు.   గ్రహణ కాలం ముగిసిన తరువాత బుధవారం తెల్లవారుజామున ఆలయ ద్వారాలు తెరచి ఆలయశుధ్ది, సంప్రోక్షణలు చేసి స్వామి అమ్మవార్లకు ప్రాత:కాల పూజలు నిర్వహిస్తారని తెలిపారు.  మంగళవారం సాయంత్రం వరకు శాకాంభరి ఉత్సవంలో భాగంగా భక్తులకు స్వామి వారి దర్శన అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: