కొన్ని రోజులుగా ఖమ్మం నగర పాలక సంస్థలో ఉద్యోగులు తమ విధులను పక్కన పెట్టి సెల్‌ఫోన్‌లో టిక్‌టాక్‌ యాప్‌ ద్వారా సరదా వీడియోలు అప్‌లోడ్‌ చేశారు. ప్రజల సమస్యల కోసం,పనిచేయడం మానేసి, టిక్‌టాక్‌తో కాలక్షేపం చేస్తున్నఉద్యోగుల నిర్వాకం, దానికి సంబంధించిన వీడియోలు నిన్న ఎపీ హెరాల్డ్‌లో చూశారు కదా. ఇది వైరల్‌ అయి తెలుగు రాష్ట్రాల్లో హల్‌చల్‌ చేసింది. దీనిని గమనించిన అధికారులు చర్యలు చేపట్టారు.

ఈ టిక్‌టాక్‌ వీడియోలతో ఆడుకుంటున్న కార్పొ రేషన్‌ సిబ్బంది తీరుపై పౌరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో పనులను పక్కనపెట్టి ఇలా టిక్‌టాక్‌లతో కాలక్షేపం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. కార్పొరేషన్‌లో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిలో క్రమశిక్షణ కొరవడడం గుర్తించి, వారిని గాడిలో పెట్టేందుకు, కార్పొరేషన్‌ అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.

మొదటి చర్యగా ఆయా ఉద్యోగుల సెక్షన్లు మార్చాలనుకున్నారు. అయితే ప్రజల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందనే పలువురు హెచ్చరించడంతో, ఆ సిబ్బందిని, శానిటేషన్‌ విభాగానికి మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: