జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాను మొట్టమొదటి సారి పోటీ చేసిన ఎన్నికల్లోనే దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే.   ఈ ఓటమి నుంచి బయటకు రావడనికి  పవన్ కి పెద్ద సమయం ఏమీ పట్టలేదు.  కాకపోతే కొంతమంది పవన్ అభిమానులకు మాత్రం ఇంకా మింగుడు పడటం లేదు. ఐతే ఇప్పటి వరకూ ఉన్న రాజకీయ చరిత్రలోనే ఒక సరికొత్త రాజకీయాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పరిచయం చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఒక్క సీటును కూడా అమ్ముకోకుండా పవన్ ఒక సరికొత్త ఒరవడికి నాంధి పలికారు.

అలాగే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ ఎలాంటి ధన ప్రవాహం కానీ మధ్య ప్రవాహం కానీ చెయ్యకుండానే 20 లక్షలకు పైగా ఓట్లు సంపాదించి సమాజంలో మార్పును కోరుకునే నిజాయితీ పరులు మా వెంట ఇంత మంది ఉన్నారని గర్వంగా చెప్పుకుంటున్నారు.అయితే పవన్ తీస్కున్నటువంటి ఈ సంచలనాత్మక నిర్ణయాలే ఇతర పార్టీలకు ఓట్లు వేసిన వారి నుంచి కూడా ప్రశంసలను అందుకునేలా చేసింది.పవన్ నిలబెట్టిన అభ్యర్థులు ఓడిపోయినా సరే ఎలాంటి డబ్బులు కానీ మందు కానీ పంచకుండానే ఓట్లు సంపాదించుకునే వారు ఇంకా ఉన్నారని  నలుగురు మాట్లాడుకునేలా చేశారు .

 కేవలం ఇదొక్క విషయం మాత్రమే కాదు ఆడుతూ పాడుతూ జీవనం సాగించే యువతకు రాజకీయాలను పరిచయం చేసిన ఏకైక నాయకుడు కూడా పవన్ కళ్యాణే అని కూడా మరో కితాబు ఇస్తున్నారు.ఈ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువత రాజకీయాల కోసం ఇంతలా మాట్లాడుకుంటున్నారు అంటే దానికి కారణం మాత్రం పవన్ కళ్యాణే కారణం అని ఈ ఘనత పవన్ కే చెల్లుతుందని రాబోయే రోజుల్లో ఈ జనసేనానికి మంచి భవిష్యత్తు తప్పకుండా ఉంటుందని ఇతర పార్టీలకు ఓట్లు వేసిన వారే మాట్లాడుకుంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: