ఆంధ్ర ప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా తెలుగుదేశం పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రవర్తిస్తున్న తీరు ప్రజలు అసహ్యించుకునేలా ఉందని రోజా ఫైర్ అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం అసెంబ్లీ ముందు మీడియాతో మాట్లాడిన రోజా టీడీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 


మీడియాతో ఆర్కే రోజా మాట్లాడుతూ గత శాసనసభలో జరిగిన ఏ అంశాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదని, తమ పార్టీ కార్యకర్తలను రౌడీలతో, గుండాలతో బెదిరించిన రోజులు ఇంకా గుర్తున్నాయని, కావాలంటే వాటిని అన్నింటిని వీడియో రూపంలో చూపిస్తామని ఆర్కె రోజా తెలిపారు. కాగా రోజా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు ఆశ్చర్యానికి గురిచేసిందని వ్యాఖ్య చేశారు. 


గతంలో సభ సంప్రదాయాల గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు సభ సంప్రదాయాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని వ్యాఖ్య చేసారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సభలో మహిళలకు ఇవ్వాల్సిన కనీసా గౌరవం కూడా ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ నేతలు ప్రవర్తించారని అన్నారు. కాగా అచ్చెన్నాయుడు తీరుని చూసి రాష్ట్రమంతా ఛీ కొడుతుందని ఫైర్ అయ్యారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: