ఆంధ్రప్రదేశ్‌ విజయవాడ సెంటర్ గా తెలుగుదేశం పార్టీ నేతలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ, విమర్శలు చేసుకుంటూ అధిష్టానానికి తెస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అధికారం కోల్పోవడంతో అసంతృప్తితో ఉన్న నేతలలో కేశినేని నాని ఒకరు. ఎన్నికల ఫలితాలు విడుదల అయినప్పటి నుంచి తన పార్టీ అధినేతకు తలనొప్పి వచ్చేలా చేస్తున్నారు కేశినేని నాని.  


ఈ నేపథ్యంలోనే సొంత పార్టీపై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. గత రెండు రోజులుగా బుద్ధా వెంకన్న, కేశినేని నాని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బుద్ధా వెంకన్న అధిష్ఠానం చెప్పినట్టు, చంద్రబాబు కోసం ఈ ట్విట్ల వార్ ఆపేస్తున్నాను అంటూ ట్విట్ చేశారు. నాని మాత్రం రాజీనామాకు సిద్ధం కానీ వార్ మాత్రం ఆపాను అని అంటున్నారు. 


ఈ తరహాలోనే ఈరోజు బుద్ధా వెంకన్న'కి కౌంటర్ గా కేశినేని ట్రావెల్స్ గురించి ట్విట్ చేశారు. ''ప్రబుద్ధుడు ''చెప్పింది అక్షర సత్యం నంబర్ ప్లేట్లు మార్చి వ్యాపారం చేసినా ఫైనాన్షియర్లకి డబ్బులు ఎగ్గొట్టి వ్యాపారం చేసినా 88 ఏళ్ల కేశినేని ట్రావెల్స్ మూసుకునే పరిస్థితి, ఆస్తులు అమ్ముకునే దుస్థితి వచ్చేది కాదు, దొంగకి వూరoదరూ దొంగలులానే కనపడతారు. అంటూ ట్విట్ చేశారు. ఈ ట్విట్ చుసిన నెటిజన్లు వార్ వన్ సైడ్ అవుతుంది, బుద్ధా వెంకన్న వార్ ఆపేస్తున్నట్టు మొన్ననే ప్రకటించారు.. మీరు ఆపండి అంటూ ట్విట్ చేస్తున్నారు.      
 


మరింత సమాచారం తెలుసుకోండి: