చంద్రబాబుకు ఎంత కష్టం వచ్చింది. గట్టిగా రెండు నెలలు కాలేదు సీఎం కుర్చీ దిగిపోయి. కానీ రాజకీయ  పతనం మాత్రం శర‌వేగంగా జరిగిపోతోంది. నిన్నటి వరకూ ప్రజా వేదిక భవనాన్ని టీడీపీ ఆఫీస్ గా వాడేసుకుని హవా చలాయించిన బాబుకు, ఇపుడు కరకట్ట కష్టాలను తెచ్చిపెడుతోంది. మానం, అభిమానం కూడా  ఫుల్ గా తీసేస్తున్నారు.


అసెంబ్లీలో ఈ రోజు మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు ఎంత  తొందరగా కరకట్ట అక్రమ కట్టడం నుంచి ఖాళీ చేస్తే  అంత మంచిదని గట్టిగానే చెప్పేశారు. బాబు ఉంటున్నది అక్రమ నివాసమని తేలిపోయిందని అన్నారు. అందువల్ల మాజీ ముఖ్యమంత్రిగా, సీనియర్ నేతగా బాబు ఖాళీ చేసేస్తే గౌరవంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.


ఒకవేళ బాబు ఇంకా పట్టుపట్టి అక్కడే ఉండాలనుకుంటే మాత్రం చట్టం తన పని తాను చేసుకునిపోతుందని కూడా బొత్స హెచ్చరించారు. అంటే బాబు ఖాళీ చేయకపోతే బలవంతంగానైనా  ఇంటి నుంచి పంపేస్తారన్నమాట. మరి ఈ మాటలు విన్న చంద్రబాబు ఎలా నిభాయించుకున్నారో ఏమో మరి. 


ఇదిలా ఉండగా కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలను అన్నింటినీ కూల్చేస్తామ‌ని బొత్స చెప్పారు. ఎవరూ చట్టానికి అతీతులు కారంటూ పక్కా క్లారిటీ ఇచ్చారు. మిగిలిన వారి సంగతేమో కానీ ఒక్క బాబుని ఖాళీ చేయిస్తే చాలు అంతా దారిని వస్తారన్నది వైసీపీ సర్కార్ ఎత్తుగడగా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: