కొత్తగా ఏర్పడ్డ  రాష్ట్రాన్ని తమ ఇష్టానుసారంగా దోచుకొని ఇప్పుడు ఏదో నీతి వ్యాఖ్యలు మాట్లాడుతూ..నా గురించి అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని మాజీ సీఎం చంద్రబాబు, లోకేష్ నాయుడు పై ఆగ్రహం వ్యక్తం చేశారు  టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి. అమరావతిలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోసం క్యాంపు కార్యాలయం నిర్మించాలన్న ప్రతిపాదనపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా దేవుడి సొమ్మును స్వాహా చేయబోతున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు.


  తాజాగా దీనిపై స్పందించిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ‘ఈ అబ్బాకొడుకులు ఇద్దరూ రాష్ట్రమంతా దోచి పారేశారు. వీళ్లు నా గురించి మాట్లాడుతున్నారు. దేవుడి సొమ్మును ఒక్క పైసా కూడా ముట్టుకోను. అవసరమైతే నా జేబు నుంచి ఖర్చు చేస్తాను. మేము ఏమీ వాళ్లలాగా దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు. మా ముఖ్యమంత్రి, మేము పదేళ్లు కష్టపడ్డాం...అందుకే ప్రజలను మమ్ముల్ని ఆదరించారని అన్నారు. 


ముఖ్యమంత్రి గారు నాకు ఈ బాధ్యతలు అప్పగించారు. దేవుడి సొమ్ము స్వాహా కాదు.. ఒక్క రూపాయి సొమ్మును వృథా కూడా కానివ్వబోం. నా ప్రయాణాలకు కూడా స్వామివారి సొమ్ము ఒక్క రూపాయి కూడా వాడను.అమరావతిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామనీ అంతేతప్ప ప్రత్యేకంగా చైర్మన్ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని తాను కోరలేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: