దేశంలో మహిళలపై రోజు రోజుకీ అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  ముఖ్యంగా యువత పోర్నోగ్రఫి కి బాగా అలవాటు పడటం...ఆడవారిని చూస్తే రెచ్చిపోవడం జరుగుతుంది.  ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా ఈ కామాంధుల చర్యలు మాత్రం అరికట్టలేక పోతున్నారు. తాజాగా వివాహితను నలుగురు వ్యక్తులు బెదిరించి ఆమెపై ఏడాదిగా అత్యాచారం చేస్తున్న ఘటన రాయదుర్గంలో సంచలనం కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఓ వీధిలో దంపతులు చేతి వృత్తి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 


ఆ మహిళ రోజూ పాల కోసం ఓ వ్యాపరి వద్దకు వెళ్లేది..ఈ క్రమంలో వారి మద్య స్నేహం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌ ద్వారా ఆమె వ్యక్తిగత సమాచారం తెలుసుకుని మరింత దగ్గరయ్యాడు.ఈ క్రమంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను రికార్డ్ చేసి నీ భర్తకు చెబుతానంటూ ఆమెను లొంగదీసుకున్నాడు. దాంతో భయంతో ఆ వ్యాపారి కి లొంగిపోయింది ఆ మహిళ. అయితే ఆ దుర్మార్గుడు మరో ముగ్గురు స్నేహితులో ఆమెను అనుభవించడం మొదలు పెట్టారు. అయితే ఆ ముగ్గురు కూడా ఈ విషయాన్ని తన భర్తకు చెబుతామని బెదిరించి ఒక్కొక్కరికగా లొంగదీసుకున్నారు.


ఏడాదిగా వీరి వేధింపులు భరిస్తూ వచ్చిన ఆమెకు ఇటీవల ఇవి మరింత ఎక్కువయ్యాయి. వీరి ఆగడాలు రోజు రోజుకీ పెచ్చుమీరడం..తమ మాట వినకపోతే నీ భర్తను చంపేస్తామని.. నీపై యాసిడ్ పోస్తామని బెదిరింపులకు దిగారు. చివరకు చేసేది లేక ఆమె అసలు విషయం భర్తకు చెప్పింది.  దాంతో భార్య భర్తలు  కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకుని .. మరో  ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: