ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ అనుభవమంతా ఆంధ్రను దోచుకోవడానికి మాత్రమే పనిచేసిందని వ్యాఖ్య చేసారు వైసీపీ మంత్రి అనిల్ కుమార్. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి, అసెంబ్లీ సమావేశాలు అనే అంటున్నారు కానీ గొడవలు తప్ప ఏమి జరగడం లేదు. 


మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు అని అధికార పార్టీ అంటే, ప్రతిపక్ష పార్టీ ఏమో ఇప్పుడు మాపై కక్ష సాధింపా అని ప్రశ్నిస్తారు ప్రతిపక్ష నేతలు. మొదటి నుంచి ఇదే గోలా.. ఈరోజు సీట్లు కేటాయింపు గురించి గొడవలే. ఈ నేపథ్యంలోనే ఆ రోజు అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై సభలో చర్చజరుగుతున్న సమయంలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు అనిల్ కుమార్. 


చంద్రబాబు నాయుడు అనుభవమంతా ఆంధ్రను దోచుకోవడానికి మాత్రమే పనిచేసిందని, మాజీ ముఖ్యమంత్రి హయాంలో చంద్రబాబు ఇరిగేషన్ శాఖలో అవినీతి జరిగిందని ఆరోపించారు. శిలాఫలకాల కోసమే కోట్లు ఖర్చు చేశారని, కానీ ప్రాజెక్టులు పూర్తి చెయ్యలేదని మండిపడ్డారు అనిల్ కుమార్. 



మరింత సమాచారం తెలుసుకోండి: