తెలుగులో మరో కొత్త దిన పత్రిక రాబోతోందన్న ప్రచారం మీడియా సర్కిల్లో బాగా వినిపిస్తోంది. ఇప్పటికే టీవీ9, 10టీవీ, మోజో టీవీలను నడిపిస్తున్న ‘మైహోం’సంస్థఇప్పుడు కొత్త డెయిలీ ప్రారంభించాలనే ఆలోచన చేస్తోందట. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు తుదిదశకు చేరుకుందట.


సాక్షి దినపత్రిక వచ్చిన తర్వాత జర్నలిస్ట్‌ల జీవితాలు మారినట్టుగానే మైహోం పత్రిక టైటిల్‌గా భావిస్తున్న ప్రభంజనంతో అప్పటి వేవ్‌ ఉంటుందనే జర్నలిస్టులు ఆశల పల్లకీలో ఉన్నారు. ఇక తెలుగు జర్నలిస్ట్‌లకు మంచి భవిష్యత్‌ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.


ఇక ఈ కొత్త పత్రిక రాకతో ఇప్పటికే టాప్ పొజిషన్ లో ఉన్న పత్రికలకే అని టాక్ వినిపిస్తోంది. అక్కడి నుంచి సిబ్బందికి ఎంత ఎక్కువ వేతనం ఇచ్చి తీసుకునేందుకు ఇప్పటికే మంతనాలు ప్రారంభమయ్యాయట. అయితే ఇంకా టైటిల్‌పై క్లారిటీ రాలేదట.


ఆ కాస్తా రాగానే నియమాకాలు మొదలవుతాయట. ఆశించిన స్థాయిలో ఇంక్రిమెంట్లు, గౌర‌వం అంద‌ని మిగిలిన పత్రికల్లోని సిబ్బందికి ఇది ఆశాకిర‌ణమే.


మరింత సమాచారం తెలుసుకోండి: