చేసిన పని గురించి చెప్పుకోవడంలో తప్పు లేదు.. కానీ పావలా వంతు పని చేసి ఐదు రూపాయల వంతు ప్రమోషన్ చేసుకుంటే ఎలా ఉంటుంది.. అచ్చు చంద్రబాబు సర్కారులా ఉంటుందంటున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు పబ్లిసిటీ గురించి వారు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.


చంద్రబాబు సర్కారు పబ్లిసిటీ వ్యవహారాల గురించి అసెంబ్లీలో వివరిస్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి అందరినీ నవ్వించారు. ఇంతకీ ఆసలు ఏం జరిగిందంటే.. చంద్రబాబు హయాంలో దోమలపై దండయాత్ర పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. దానికి భయంకరంగా పబ్లిసిటీ చేశారు.


అప్పట్లో కర్నూలు సెంటర్ లో చంద్రబాబు కటౌట్ ఒకటి బాహుబలి టైప్ లో పెట్టారట. ఆయనకు అందులో కిరీటం కూడా పెట్టారట. చేతిలో ఒక పెద్ద కత్తి పెట్టారట. ఆ పక్కనే ఒక దోమను పెట్టారట. అది చూసి జనం అంతా నవ్వుకున్నారని మంత్రి బుగ్గన సభలో వివరించారు. ఆ కటౌట్ చూడలేక తాను కూడా ఆనాటి కలెక్టర్ కు పోన్ చేసి ముఖ్యమంత్రి ఇలా దోమపై యుద్దం చేస్తున్నట్లు పెట్టడం బాగోలేదని చెప్పారట.


టిడిపి పాలనలో మేటర్ తక్కువ, పబ్లిసిటీ పీక్ అన్నట్లుగా వ్యవహారాలు సాగాయని మంత్రి బుగ్గన ఈ ఉదాహరణతో చెప్పారు. అప్పట్లో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లు పెట్టి ఉద్యోగులను ఇబ్బంది పెడుతుంటే హ్యాపీ సండే ఎక్కడుందని మంత్రి బుగ్గన ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: