జగన్ కి అనుభవం లేదని ఎవరు అనగలరు, ఆ మాటకు వస్తే అనుభవం ఎవడికి కావాలి. ఆకలి, బాధలను అర్ధం చేసుకునే పాలకులు కావాలి. జగన్ మనసుతో ఆలోచిస్తున్నారు కాబట్టే ఆయన బడ్జెట్ సహా అన్ని నిర్ణయాలు పేదల కోసమే అన్నట్లుగా రూపకల్పన చేయబడ్డాయి.


రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఒకే విడత 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన  ఫైల్ ని ఈ రోజు  రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించనుంది. జగన్‌ ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కూడా పూర్తి కాకుండానే ఒక చరిత్రను సృష్టించబోతోంది. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 14,900 గ్రామ, వార్డు సచివాలయాలలో పని చేసేందుకు మొత్తం 1,33,867 కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటున్నారు. 


 ఇందుకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో పెట్టాల్సిన ఫైలుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిన్ననే ఆమోద ముద్ర వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 13,065 గ్రామ పంచాయతీలకు గాను ప్రభుత్వం 11,114 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనకు వచ్చింది. వీటిలో పని చేసేందుకు 99,144 మందిని కొత్తగా నియమించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాల ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. వార్డు సచివాలయాల్లో పని చేసేందుకు 34,723 మంది ఉద్యోగులను నియమిస్తారు


 
కొత్తగా 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై  కేవలం వారం పది రోజుల వ్యవధిలో శాఖల వారీగా నోటిఫికేషన్లు వెలువడుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నోటిఫికేషన్‌ సమయంలోనే ఏ ఉద్యోగానికి ఏ విద్యార్హత అన్న వివరాలను ఆ శాఖలు వెల్లడించనున్నాయి. నోటిఫికేషన్లలో శాఖల వారీగా వెలువరించిన ఉద్యోగాలను జిల్లాల వారీగా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ప్రత్యేక కమిటీ (డీఎస్‌సీ)లు రాత పరీక్ష నిర్వహించడం ద్వారా భర్తీ చేస్తాయి.


ఈ ఉద్యోగాల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలు రిజర్వేషన్ల మేరకు ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉంది.  మొత్తానికి ఉద్యోగాల విప్లవం తెస్తానని పాదయాత్ర సందర్భంగా చెప్పిన జగన్ ఆ దిశగా వెంటనే యాక్షన్ తీసుకోవడం నిజంగా ఆయన నిబధ్ధతకు నిదర్శనం.
  


మరింత సమాచారం తెలుసుకోండి: