ప్రజల సమస్యలు తీర్చడంలో ఎవరినీ లెక్క చేయరు. అటువంటి అధికారిని తన టీంలోకి తెచ్చుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ మేరకు కర్నాటకతో సంప్రదింపులు జరిపారు. వాళ్లు అంగీకరించారు. కేంద్రం నుండి క్లారిటీ రావాల్సి ఉంది. మరి కొన్ని రోజుల్లో ఆ డైనమిక్ అధికారి ఏపీ ముఖ్యమంత్రి టీంలో చేరబోతున్నారు. సామాన్య ప్రజలతో మమేకం అయ్యే ఈ అధికారి కి ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ''స్పందన'' పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించనున్నారు.
ఎవరీ రోహిణి ?
కర్నాటకలో పదేళ్ల ఐఏయస్ సర్వీసులో అనేక బదిలీలు ఎదుర్కొన్నారు. తమ కోసం పని చేసే అధికారిని బదిలీ చేయవద్దంటూ ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. దాసరి రోహిణీ సింధూరి తెలుగమ్మాయి. ఖమ్మం జిల్లాలో పుట్టి, హైదరాబాద్లో పెరిగారు. ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు. కర్ణాటకలో పోస్టింగ్ అందుకు న్నారు. అక్కడ వివిధ ప్రాంతాల్లో పని చేసిన సమయంలో కరువు రైతులకు పరిహారం విషయంలోనూ.. కొబ్బరి నీళ్లతో కార్పోరేట్ వ్యాపారం చేయట ఎలాగో రైతులకు నేర్పించి వారి మనస్సుల్లో స్థానం సంపాదించారు.
2009 ఐఏ యస్ బ్యాచ్కు చెందిన రోహిణీ సింధూరి నెల్లూరుకు చెందిన సుధీర్ రెడ్డిని వివాహమాడారు. ప్రజల సమస్యల మీద నిక్కచ్చిగా పోరాడే రోహిణీ సింధూరిని ఏపీకి రావాలని జగన్ కబురు చేయగా వెంటనే అంగీకరించారు.