ఆంధ్రప్రదేశ్ లో నేడు అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతోంది. అక్రమ కట్టడాలపై చర్చ జరుగుతోంది చంద్రబాబు ఉంటున్న నిర్మాణాన్ని కూల్చాలని చేసిన ప్రయత్నాన్ని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇప్పటికే భవనాల కూల్చాలన్న కక్ష సాధింపు చర్యలకు పాల్పొడద్దని, జనాలకు భయభ్రాంతులకు గురి చేయద్దని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల చాలా మంది ప్రజలు భయబ్రాంతులకు గురౌతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ మధ్య రోడ్డుపై పెట్టిన రాజశేఖర్ రెడ్డి విగ్రహాల గురించి మాట్లాడుతూ "రోడ్లపైన విగ్రాహాలు పెడుతున్నారు సుప్రీమ్ కోర్టు ఆదేశాల ప్రకారం రోడ్డుపైన విగ్రాహాలు పెట్టకూడదు" అని చంద్రబాబు పేర్కొన్నారు. సభలో పూర్తి గా గందరగోళం నెలకొంది అప్పుడు స్పీకర్ తమ్మిరెడి గారు చంద్రబాబును మాట్లాడనీయకుండా కూర్చోండి అని అన్నప్పుడు 'మీరు నా నోరును మూయించలేరు నేనెవరి బెదిరింపుల భయపడేవాడిని కాదు' అని చంద్రబాబు అన్నారు.
ప్రశ్నోత్తరాల సమయాన్ని అవకాశం ఇచ్చినప్పుడు వృధా చెయకుండా సద్వినియోగం చెయాలని సభా సమయాన్ని విపక్ష సభ్యులు ఉపయొగించుకోవాలి అని అసహనం చూపారు.