తాను వైఎస్పార్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ చంద్రబాబునాయుడు సంచలన విషయం బయటపెట్టారు. కరకట్ట మీద నిర్మించిన  అక్రమ నిర్మాణాల కూల్చివేతపై అసెంబ్లీలో జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడుతూ తాను, వైఎస్సార్ ఎంత బెస్ట్ ఫ్రెండ్సో సభలో ఉన్న వాళ్ళల్లో చాలామంది తెలుసన్నారు. 1978-83 వరకూ ఇద్దరమూ కలిసే ఉన్న విషయం వాస్తవం కాదా అంటూ సభ్యులను ఎదురు ప్రశ్నించారు.

 

ఒకపుడు తాను, వైఎస్సార్ ఒకే మంచంపైన పడుకున్న విషయం చాలామందికి తెలియకపోవచ్చని చంద్రబాబు చెప్పటమే విచిత్రంగా ఉంది. అక్రమనిర్మాణాల విషయంలో వైఎస్సార్ విగ్రహాన్ని కడపుమంటతోనే తాను కూల్చేసినట్లు వైసిపి ఎంఎల్ఏ అంబటి రాంబాబు చెప్పటాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. ఆ సందర్భంగానే చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్సార్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని చెప్పుకున్నారు.

 

తెలుగుదేశంపార్టీ పెట్టిన తర్వాత తాను టిడిపిలోకి వెళిపోతే వైఎస్సార్ మాత్రం కాంగ్రెస్ లోనే ఉన్నారని గుర్తు చేశారు. ఇక్కడ విషయం ఏమిటంటే తాను నివాసముంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమనిర్మాణం కూల్చివేత అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు చంద్రబాబు చాలానే ప్రయత్నం చేశారు. కానీ వైసిపి సభ్యులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

 

హోలు మొత్తం మీద తాను నివాసముంటున్న అక్రమ నిర్మాణం నుండి ఖాళీ చేసే ఉద్దేశ్యంలో చంద్రబాబు లేరని అర్ధమవుతోంది. తాను చేసిన తప్పునుండి బయటపడేందుకు రాష్ట్రంలోని వేలాది అక్రమనిర్మాణాలను, అక్రమంగా నిర్మిచిన వైఎస్సార్ విగ్రహాలు తదితరాలను ప్రస్తావించటమే విచిత్రంగా ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: