ఏపీ అసెంబ్లీలో ఆసక్తికరమైన అంశం జరిగింది. కరకట్ట మీద అక్రమ కట్టడాలపై ఉన్న నిర్మాణాలపై చర్చ జరుగుతోంది. చంద్రబాబు అక్రమంగా కట్టిన ఇంట్లో ఉంటున్నారని వైసీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబు అక్రమ నిర్మాణాల గురించి సీఎం మాట్లాడితే ముందు రాష్ట్రంలో అడ్డుగా అనుమతిలేని విగ్రహాలను కూల్చేయాలి అన్నారు.

 

 

దీంతో అధికారపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి చంద్రబాబు వివరణ ఇస్తూ "నేనూ వైఎస్ కు శత్రువును కాదు. మేమిద్దరం స్నేహితులం. ఒకేసారి రాజకీయ ప్రస్థానం ప్రారంభించాం. ఆ సమయంలో మేమిద్దరం ఒకే రూమ్ లో ఉన్నాం. జగన్ కు ఈ విషయాలు తెలీకపోవచ్చు. నేను టీడీపీలోకి వచ్చాను, ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు" అంటూ నవ్వుతూనే చెప్పి సభలో ఒకరకంగా ఆహ్లాద వాతావరణం కల్పించారు. 

 

 

ఇటువంటి వాఖ్యలు గతంలో చంద్రబాబు నుంచి ఎప్పుడూ రాలేదు. వైఎస్-బాబు మధ్య స్నేహం ఉందని నామమాత్రంగా తెలిసినా ఇలా ప్రజలకు బహిరంగంగా వైఎస్ తో స్నేహం గురించి చెప్పటం కొత్తగా అనిపించింది. ఇటీవల వచ్చిన ఎన్టీఆర్ సినిమాలో కూడా చంద్రబాబు పాత్రధారి వైఎస్ ను ఎన్టీఆర్ కు తన స్నేహితుడిగా పరిచయం చేయటం చూసాం.

మరింత సమాచారం తెలుసుకోండి: