అసెంబ్లీలో అధికార పక్షం అయిన వైస్సార్సీపీ .. టీడీపీ పార్టీని ఇరుకున పెట్టే విధంగా మాట్లాడతుండటంతో టీడీపీ నాయకులకు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అధికార పక్షం దెబ్బకి అచ్చెన్నాయుడి నోరు మూగబోయింది, బుచ్చయ్య చౌదరికి ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదు, సీనియర్లు గంటా, కరణం.. ఎవ్వరూ కలుగజసుకోవడంలేదు. కనీసం చంద్రబాబు కూడా తమాయించుకుని మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది.


ఆఖరుకు జనసేన సభ్యుడు మాట్లాడినంత సేపు కూడా టీడీపీ సభ్యులు మాట్లాడలేకపోయారు. దిక్కుతోచని స్థితిలో స్పీకర్ ని టార్గెట్ చేసి టీడీపీ సభ్యులు చీవాట్లు తినడం ఒక్కటే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. గతంలో ఎప్పుడూ స్పీకర్ ఈ స్థాయిలో సభ్యులకు వార్నింగ్ లు ఇచ్చిన దాఖలాలు లేవు. నన్ను భయపెట్టొద్దు, స్పీకర్ చైర్ ని టార్గెట్ చేసి మాట్లాడొద్దు అని పదే పదే చెప్పినా చంద్రబాబు తీరు మారకపోవడంతో నాకు తెలుసులేవయ్యా ఇకచాలు అని స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తంచేయాల్సి వచ్చింది.


ఒకరకంగా టీడీపీ పలాయనవాదాన్నే నమ్ముకుంది. సభనుంచి పారిపోడానికి, లేదా క్రమశిక్షణ ఉల్లంఘించి వేటు వేయించుకోడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. అసెంబ్లీలో మాట్లాడవయ్యా అంటే గొడవ చేస్తున్న చంద్రబాబు సమావేశాలు ముగిసిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. మొత్తమ్మీద అసెంబ్లీ సమావేశాలు మాత్రం అర్థవంతంగా జరగడంలేదనేది వాస్తవం. టీడీపీ చేతులెత్తేయడంతో వార్ వన్ సైడ్ అయిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: