తెలంగాణ అసెంబ్లీ లో ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పలు బిల్లులపై ఇవాళ, రేపు చర్చలు జరపనున్నారు.సభలో ముందుగా సీఎం కేసీఆర్ కొత్త మున్సిపల్ చట్టంను ప్రవేశపెట్టారు.సాయంత్రం వరకు సభలో ఈ బిల్లుపై ప్రభుత్వం మార్పులను అంగీకరించనుంది మరియు రేపటి సభలో ఈ బిల్లుపై చర్చలు జరపనున్నారు. అంతేకాక మెడికల్ కాలేజీ లెక్చరర్ల పదవీ విరమణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.
మెడికల్ కాలేజీలలో ప్రొఫెసర్లు కావాలంటే సీనియారిటీ ప్రకారం రావాల్సి ఉంటుందని, కేసీఆర్ ఈ నేపథ్యంలోనే మెడికల్ కాలేజీలలో ప్రొఫెసర్ల ఏజ్ పెంచుతున్నట్లు తెలియజేశారు. మెడికల్ కాలేజీలలో ప్రతి సంవత్సరం సీట్లు తగ్గుతూ వస్తున్నాయని, దీనికి కారణం ప్రొఫెసర్ లు లేకపోవడమే ప్రధాన కారణంగా భావించిన కెసీఆర్ ఇకపై అలాంటి పరిస్థి రాకూడదని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు.
అదేకాక తక్కువ సమయంలో వారి పాలనలో ఎన్నో పనులు చేశామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఏడు కార్పొరేషన్లను కొత్తగా వారు సిద్ధం చేయబోతున్నారని కేసీఆర్ వెల్లడించారు. ఈ బిల్లుకు ఎంఐఎం,కాంగ్రెస్ పార్టీలు ఆమోధం తెలిపాయి.కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క వైద్య విద్యార్థులు పోస్టుల భర్తీ చేయటం కోసం ఎదురుచూస్తున్నారని వెంటనే వాటిని భర్తీ చేయాలని ఆయన కోరారు.రాజ్యాంగబద్దంగానే టీఆర్‌ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనం జరిగిందని సీయం కేసీఆర్ స్పందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: