మంగళగిరి అంటే తెలుసు, మందలగిరి అంటే కూడా తెలుసుగా. అదే తెలుగుదేశాధీశుడు చంద్రబాబు సుపుత్రుడు. ఆయన రెండేళ్ళ పాటు మంత్రిగా చేశారు. కీలకమైన అయిదు శాఖలను కూడా కట్టబెట్టారు. సీన్ కట్ చేస్తే మంగళగిరిలో దారుణంగా ఓటమిపాలు అయ్యారు. జయంతికీ, వర్ధంతికీ తేడా తెలియని లోకేశమే ఇపుడు పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటూ వైసీపీ నేతలు సెటైర్లు కూడా వేస్తున్నారు.


అయితే ఈ ట్విట్టర్ పిట్ట శాసనమండలిలో సరైన మంత్రి గారికే దొరికేసింది. ఈ రోజు శాస‌నమండలిలో చర్చ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూంటే అడ్డుపడిన లోకేష్ జగన్ని విమర్శిస్తూ పరుష పదజాలమే వాడారు. పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చిన వారి పాలన ప్రజల దురద్రుష్టం అంటూ ఘాట్ కామెంట్స్ చేశారు. దీంతో రెచ్చిపోయిన అనిల్ లోకేష్ ని గుక్క తిప్పుకోకుండా చేసేశారు. 


తెలుగు మాట్లాడడం కూడా రాని నీబు కూడా మంత్రివే  అంటూ లోకేష్ మీద ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకున్నది ఎవరు, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికేసింది ఎవరు అంటూ అనిల్ ప్రశ్నన వర్షం కురిపించేశారికి లేకేశానికి మతి పోయినంత పని అయింది. ఏదో విమర్శ చేయాలనుకుంటే బూమరాంగ్ అయిందని చినబాబు బాధపడేలా అనిల్ కుమార్ గట్టి జవాబే చెప్పారు మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: