చంద్రబాబునాయుడుది ఎపుడూ ఒకే టైప్ రాజకీయం. తాను మంచి అవతల వాళ్ళు చెడ్డ. దాన్ని అలా కలరింగ్ ఇచ్చేందుకు, ట్విస్ట్ చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక బాబు గారికి అనుకూలంగా బలమైన మీడియా కూడా ఉంది. ఆయన తరఫున పేజీలకు పేజీలు అచ్చేసి జనాలను మభ్యపెట్టే ప్రొగ్రాం ఎటూ ఉంది.


అసెంబ్లీలో చూసుకుంటే బాబు తీరు ఇలాగే ఉంది. తాను ఒకటి అనడం నాలుగు పడడం, చివరికి తన వయసుకు గౌరవం ఇవ్వడంలేదని బొల్లి ఏడుపులు ఏడవడం. అసలు పెద్దమనిషిగా ఉండాల్సిన బాబు ఎందుకు గిల్లి కజ్జాలు పెట్టుకోవడం అంటే దానికీ పరమార్ధం ఉంది. రాజకీయ సానుభూతి కోసమట.  తనని కుర్ర సీఎం ఆయన టీం అసెంబ్లీలో తెగ వేధించేస్తున్నారని బయట చెప్పుకోవడం కోసమట. 


ఇక బాబు ఇపుడు అక్రమాల పుట్టలో తలదాచుకున్నారు. లింగమనేని గెస్ట్ హౌస్ లో చానాళ్ళుగా కాపురం ఉంటున్నారు.  దాన్ని కూలుస్తామంటే ఏవేవో కధలు చెబుతూ అన్ని అనుమతులూ ఉన్నాయని అంటున్నారు. రోడ్డు మీద విగ్రహాలు అడ్డంగా లేవా, మరోటి లేదా అంటూ ఇంకా ఏవేవో చెబుతున్నారు. సరే కానీ ఇపుడు బాబు గారు అందులో నుంచి ఖాళీ మాత్రం చేయరంతే. ఆయన్ని బలవంతంగా ఖాళీ చేయించాలన్నదే తెలివైన  ఎత్తుగడ.


అలా ఖాళీ చేయిస్తే నెక్స్ట్ సీన్ ఏంటో ఆయన రాసేసి పెట్టేసుకున్నారు కూడా. రోడ్డు మీద పడుకుంటారుట. అంటే తనను బలవంతంగా ఇల్లు లేకుండా చేశారని చెప్పడం బాబు గారి అసలైన రాజకీయం ఈ రకంగా ఏడుపుగొట్టు రాజకీయాలతో జనం కళ్ళల్లో నీళ్ళు నింపి అందులో నుంచి ఓట్లను, సీట్లను  పొందాలన్నదే బాబోరి ప్లాన్. మరి వర్కౌట్ అవుతుందా.


మరింత సమాచారం తెలుసుకోండి: