ఆంధ్ర ప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అతనికి మంచి స్నేహితుడని, రాజకీయాలలో గొడవలు తప్ప వ్యక్తిగతంగా అతనితో ఎలాంటి గొడవలు, కక్షలు లేవని అసెంబ్లీలో తెలిపాడు. 


ఈ వీడియోని అతని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు చంద్రబాబు నాయుడు. ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఇలా రాసారు 'వైఎస్ రాజశేఖర్ రెడ్డికీ, నాకూ మధ్య రాజకీయ విరోధం తప్ప, ఎలాంటి వ్యక్తిగత విరోధం లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం'. అంటూ వీడియోని జత చేసి పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోకి ట్విట్టర్ వేధికగా నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంది. 


కాగా ఈ వీడియోలో 'అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు తాను రాజశేఖర్ రెడ్డి మిత్రులం అని చెప్తున్నప్పుడు, పాలకపక్షం నుంచి అరుపులు వస్తున్నప్పటికీ, చంద్రబాబు నవ్వుతు 1978 నుంచి 1983 కాలంలో ఇదే అసెంబ్లీ ఉన్న వాళ్ళను అడగండి మేము ఎంత మంచి మిత్రులం అనేది చెప్తారు అంటూ వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలకు వైఎస్ జగన్ నవ్వారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.       


 


మరింత సమాచారం తెలుసుకోండి: