తాజా ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. జనసేన ఘోరంగా ఓడిపోవడం ఒక ఎత్తు అయితే.. ఎమ్మెల్యేగా పోటీ చేసిన భీమవరం.. గాజువాక నియోజకవర్గాల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు. గాజువాకలో అయితే ఏకంగా మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే తాను ఇక నుంచి ఫుల్ టైం పొలిటీషియన్ గా ఉంటానని.. సినిమాలకు దూరం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ రాజకీయాల్లో విఫలమైనా.. ఓ సినిమా హీరోగా ఆయనకు ఇప్పటికీ మంచి అన్నది వాస్తవం. పవన్ ని చూసేందుకు ఆయన ప్రసంగాలు వినేందుకు జ‌నాలు తండోప‌తండాలుగా వస్తారు.


ఇదిలా ఉంటే పవన్ గురించి ఓ సరికొత్త వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వచ్చే ఐదేళ్ల పాటు రాజకీయాలు చేయాలంటే పవన్ కు డబ్బులు కావాలి. ఈ క్రమంలోనే తన పబ్లిక్ అప్పీరియ‌న్స్‌ను కూడా వాడుకుంటూ డబ్బులు డిమాండ్ చేయటం మొదలు పెట్టేశాడు అన్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తెలుగు వాషింగ్టన్ డీసీ లో జరిగిన నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్ వేడుకకి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.


ఈ కార్య‌క్ర‌మానికి చాలా మంది ఎన్నారైలు కూడా వ‌చ్చారు. ప‌వ‌న్ సినిమాల‌కు దూర‌మై.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చినందునే ఈ కార్య‌క్ర‌మానికి గెస్ట్‌గా హాజ‌రైయ్యార‌ని అంద‌రూ భావించారు. కానీ దీని వెనక ప‌వ‌న్‌కు కొంత అమౌంట్ ఫెయిడ్ చేశార‌ని టాక్‌. తానా ఈవెంట్ కోసం ఏకంగా 50 వేల డాలర్లు పుచ్చుకున్నారట. ఇక ఫ‌స్ట్ క్లాస్ టిక్కెట్లు.. వ‌గైరా మామూలే. మరి ఈ వార్త‌ల్లో ఎంత వాస్త‌వం ఉందో గాని... ప్ర‌స్తుతం ఇది అటు ఇండ‌స్ట్రీతో పాటు ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: