అసెంబ్లీలో జగన్ , చంద్రబాబు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. జగన్ ను బాబు మెచ్చకోవటం ఆసక్తికరం. ఈరోజు అక్రమ కట్టడాలపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇరు పక్షాల సభ్యులు తమ అభిప్రాయాలు తెలిపారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ కరకట్టపై నిర్మాణాలకు తమ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకం అని, నదీ పరీవాహక ప్రాంతాల్లో తీరంపై కట్టడాల వల్ల నది దిశను మార్చుకుంటుందని, వరదలు వచ్చే ప్రమాదం ఉందని వివరించారు.


  అనంతరం చంద్రబాబు దీనిపై మాట్లాడారు. జగన్ చెప్పింది నిజమేనని నదీ తీరంలో కట్టడాల వల్ల నదికి వరదలు వచ్చినపుడు దిశ మార్చుకుని ప్రవహించే ప్రమాదం ఉందని అని చెప్పిన చంద్రబాబు... జగన్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. అదేసమయంలో ఉండవల్లిలోని తన నివాసం కృష్ణానది పరీవాహక ప్రాంతం కిందకు రాదని వెల్లడించారు.


ఒకప్పుడు గూగుల్ మ్యాప్ లో చూసినా కృష్ణా నదిని భవానీ ద్వీపం నుంచి చూపిస్తుందని వ్యాఖ్యానించారు. బ్యారేజీ నిర్మాణం వల్ల నదిలోని ఓ పాయ చీలి ఇటువైపుగా ప్రవహిస్తోందని చెప్పారు. నేను ఉంటున్న ఇల్లు ఆ పాయ పక్కన కట్టి నిర్మాణమని, అందుకే అది అక్రమ కట్టడం కిందకు రాదన్నారు చంద్రబాబు. అయితే,  ఈ ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తోందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: