15 రోజుల్లో బయట పడతాయంటూ జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది. పదే పదే ఇదే అంశంపై టిడిపి తిప్పి తిప్పి ప్రశ్నలు వేస్తోంది. దాంతో జగన్ కు మండిపోయింది.
ఇదే విషయమై సభలో మాట్లాడుతూ ఉద్దేశ్యపూర్వకంగానే టిడిపి ఒకే అంశాన్ని తిప్పి అధికారంలో ఉన్నపుడు చంద్రబాబునాయుడు చేసిన స్కాంలన్నీ తిప్పి ప్రశ్నలు వేస్తోందన్నారు. ఇప్పటికే పోలవరంలో జరిగిన అవినీతిపై నిపుణుల కమిటి వేసిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారులతో మాట్లాడిన తర్వాత తన ప్రాధమిక అవగాహన ప్రకారమే సుమారు రూ. 1500 కోట్ల అవినీతి జరిగినట్లు చెప్పారు.
నిపుణుల కమిటి పూర్తిస్ధాయిలో అవకతవకలపై అధ్యయనం చేసి తనకు మరో మూడు రోజుల్లో నివేదిక ఇస్తుందన్నారు. నివేదిక వస్తే తన బండారం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతోనే చంద్రబాబు ఇష్యుని కంపు చేస్తున్నారంటూ మండిపోయారు. చంద్రబాబు అధికారంలో ఉండగా చేసిన అవినీతి మొత్తాన్ని మరో 15 రోజుల్లో బయటపెడతామని జగన్ ప్రకటించారు.