దేశంలో ఇప్పుడు బీజేపీ పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల నుంచి సీనియర్ నేతలు, కాంగ్రెస్ ఇతర పార్టీ నేతలు బీజేపీ లోకి వలస వస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ, టీవీ నటులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ నేతృత్వంలో ఢిల్లీలో వీరంతా కాషాయ కండువా కప్పుకున్నారు. పర్నోమిత్ర, రిషి కౌషిక్, కాంచన మొయిత్ర, రూపంజన మిత్ర, బిశ్వజిత్ గంగూలీ తదితర మొత్తం 12 మంది నటీనటులు బీజేపీలో చేరారు. 

దేశంలో రెండు పర్యాయాలు ప్రధాని కావడం అనేది ఎంతో గొప్ప విషయం అని..ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ది పనులే ఆయనను గెలిపించాయని అన్నారు.  ప్రధాని మోదీ చేస్తున్న మంచి పనులకు తాము ఆకర్షితులమయ్యామని అందుకే బీజేపీలోకి వచ్చామని అన్నారు.  ప్పటికే పలు పార్టీలకు చెందిన నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

అధికార టీఎంసీ సహా కాంగ్రెస్, సీపీఎం నేతలు బీజేపీలోకి క్యూకట్టారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో బీజేపీ గణనీయమైన స్థానాలు సాధించిన తర్వాత వలసలు ఊపందుకున్నాయి


మరింత సమాచారం తెలుసుకోండి: