అసెంబ్లీ సమావేశాల్లో జరిగే చర్చల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ముందు 40 ఇయర్స్ ఇండస్ట్రీ తేలిపోతున్నారనే చెప్పాలి. విషయం ఏదైనా కానీండి జగన్ ఫుల్లుగా ప్రిపేర్ అయ్యే సభలోకి అడుగుపెడుతున్నారు.  ఎప్పుడైతే సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకుని మాట్లాడుతున్నారో సమాధానం చెప్పలేక చంద్రబాబు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిపోతోంది.

 

కరకట్ట మీద నిర్మించిన అక్రమనివాసంలో ఉండటం, పోలవరం ప్రాజెక్టులో అవినీతి, విద్యుత్ పిపిఏల్లో అవినీతి,  బడ్జెట్ పై జరిగిన చర్చ, ప్రజావేదిక కూల్చివేత, నవరత్నాల అమలు.....ఇలా విషయం ఏదైనా కావచ్చు. గడచిన ఐదేళ్ళ చంద్రబాబు హయాంలో జరిగిన అడ్డుగోలు పాలనను సమర్ధించుకోలేక చంద్రబాబు నానా అవస్తలు పడుతున్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది.

 

కరకట్ట మీద నిర్మించింది అక్రమ నిర్మాణమని తెలుసీ అందులో ఉంటున్న కారణంగా చంద్రబాబు మాట్లాడలేకపోతున్నారు. ప్రజావేదిక నిర్మాణమే అక్రమం కాబట్టి సమర్ధించుకోలేకపోయారు. బడ్జెట్ పై చర్చలో కూడా అంతే. అంశాలవారీగా జగన్ వివరణ ఇస్తుంటే ఏదో మాట్లాడాలి కాబట్టే మాట్లాడుతున్నట్లుంది చంద్రబాబు.

 

ఇక పోలవరం, విద్యుత్ పిపిఏల్లో కూడా ఎక్కడెక్కడ ఎంతెంత అవినీతి జరిగిందో వివరిస్తూ చంద్రబాబును జగన్  వన్ సైడ్ బ్యాటింగ్ ను చేస్తున్నారు. జగన్ కు అండగా బుగ్గన, అనీల్, కొడాలినాని తదితరులతో పాటు  చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఆళ్ళ లాంటి వాళ్ళు నిలబడుతుండటంతో చంద్రబాబు అండ్ కో చేసేదేమీ లేక చర్చల్లో చేతులెత్తేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: