30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో ఫేమస్ అయిన కమెడియన్ పృథ్వీ కొన్నేళ్లుగా వైసీపీలో చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన జోరుగా ప్రచారం చేశారు. ఇప్పడు వైసీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో జగన్ ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.


ఇప్పటికే పృధ్వీ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయనకు ఇప్పుడు శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ఎస్వీబీసీ చైర్మన్ గా పృథ్వీని జగన్ నియమించారు. ఈనెల 28న పృథ్వీ బాధ‌్యతలు స్వీకరిస్తారు.


గతంలో ఈ ఎస్వీబీసీ ఛైర్మన్ గా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు సేవలు అందించారు. ఇప్పుడు అలాంటి కీలకమైన పోస్టు పృథ్వీకి అందబోతోంది. ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి అప్పగించడం దవారా నమ్ముకున్న వాళ్లకు జగన్ ఏదో ఒకటి చేస్తాడన్న విషయం మరోసారి రుజువైంది.


ఇక మరో నటుడు అలీకి ఇప్పటికే ఎమ్మెల్సీ సీటు ఖాయమైందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అలీ కూడా శాసన మండలికి వెళ్లి అధ్యక్షా.. అనే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: