దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్న పిల్లల నుంచి ముదుసలి వరకు ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది.  గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారం, హత్య కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  తాజాగా అనంతపురంలో జరిగిన దారుణం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ బాలికను కిడ్నాప్ చేసిన యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

గుత్తి మండలంలోని టి.కొత్తపల్లికి చెందిన నరేష్‌ అనే యువకుడు తన కుమార్తెను మూడు నెలల కిందట కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసినట్లు గుత్తి పట్టణానికి చెందిన మహిళ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను అపహరించి అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను తరచూ వేధింపులకు పాల్పడుతూ హింసించాడు.

అతడి వేధింపులను భరించలేని బాలిక విషయాన్ని తల్లి దృష్టికి తీసుకెళ్లడంతో తాజాగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరికి ఆ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: