ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సాధారణ పాస్పోర్ట్ స్థానంలో డిప్లమాటక్ పాస్పోర్ట్ను అందజేశారు. ఆయన సతీమణి వైఎస్ భారతితో కలిసి విజయవాడ పాస్ పోర్టు ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లిన జగన్ తన డిప్లొమేటిక్ పాస్ పోర్టును తీసుకున్నారు. సీఎంకి అధికారులు ఈ పాస్పోర్ట్ను అందజేశారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్, రాయబారులకి మాత్రమే ఈ పాస్పోర్ట్ జారీచేస్తారు.
ఈ పాస్ పోర్ట్ ప్రత్యేకతలు :
విమానాశ్రయంలో నేరుగా ప్రవేశించే అవకాశం ఉంది. విదేశాల్లో పనిచేసే భారత దౌత్య సిబ్బంది, వారి కుటుంబీకులకూ ఈ పాస్ పోర్టును ఇస్తుంది. అక్కడ ఎలాంటి తనిఖీలు ఉండవు. విశ్రాంతి తీసుకోడానికి ప్రత్యేకమైన లాంజ్ కూడా ఉంటుంది. అలాగే విమానం బయలుదేరడానికి గంట ముందు విమానాశ్రయానికి చేరుకోవాలన్న నిబంధన ఉండదు. నేరుగా తాము వెళ్లాల్సిన విమానం వద్దకు ప్రభుత్వ వాహనంలో చేరుకోవచ్చు.