గుంటూరులో జరిగిన విలేఖరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉండబోతోంది అనేది రెండు నెలల్లో తెలిసిపోయిందని ఆయన పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను సీఎం జగన్ ఉపసంహరించుకోవాలన్నారు. అలాగే ఆయన పాదయాత్రకు ముఖ్యమంత్రి అనుమతించకపోవడం దారుణం అని పేర్కొన్నారు. జగన్ పాలన ఎలా ఉండబోతోందో రెండు నెలల్లో తెలిసిపోయిందనీ,పోలీసులతో అణచాలని చూస్తే చంద్రబాబుకు పట్టిన గతే జగన్ కు పడుతోందన్నారు.
వాగ్దానాలు నిలబెట్టుకోవడంపై జగన్ తన సంకల్పాన్ని ప్రదర్శించాలని, ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు కలెక్టరేట్ల వద్ద దీక్షలు జరుపుతామని ఈ సందర్బంగా కృష్ణ మాదిగ పేర్కొన్నారు.