మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతోందనేందుకు నిదర్శనంగా మరో ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. ఓ యువకుడిపై కోపం పెంచుకున్న ఇద్దరు యువకులు అతడిని కిరాతకంగా హత్య చేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తి తలను చేతపట్టుకుని ఏకంగా పోలీస్ స్టేషన్ కే వెళ్లారు.


నల్గొండ జిల్లా నాంపల్లిలో ఈ దారుణం జరిగింది. నేరేళ్ల పల్లికి చెందిన సద్దాం అనే యువకుడిని.. నడిరోడ్డుపై ఇర్ఫాన్, గౌస్ అనే ఇద్దరు వ్యక్తులు వెంటాడి నరికేశారు. ఆ తర్వాత ఏమాత్రం బెరుకు లేకుండా తలను మొండెం నుంచి వేరు చేశారు.


అదే తలను చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. ఈ దారుణానికి వివాహేతర సంబంధమే కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తర్వాత ఈ హత్య గురించి ఓ నిందితుడు వివరిస్తుంటే.. మరో నిందితుడు తాపీగా స్మార్ట్ ఫోన్ లో ఏదో చూస్తుండటం విస్తు గొలుపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: