ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలువురు అధికారులను బదిలీ చేసిన ఆయన తాజాగా మరికొందరికి స్థానచలనం కల్పించారు. పలువురు కీలక ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. మొత్తం 10 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.
కాపు కార్పొరేషన్ ఎండీగా ఎం.ఎన్.హెచ్.ప్రసాద్
పరిశ్రమల శాఖ (హెచ్అండ్టీ) విభాగం కార్యదర్శిగా శ్రీనివాస్ శ్రీనరేశ్
సీసీఎల్ఏ ప్రత్యేక కమిషనర్గా ఎం.హరినారాయణన్
విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా పి. కోటేశ్వరరావు
యువజన సర్వీసుల శాఖ ఎండీ, ఏపీ స్టెప్ ఎండీగా సి.నాగరాణి
గనుల శాఖ కార్యదర్శిగా కె.రాంగోపాల్
పౌరసరఫరాల శాఖ డైరెక్టర్గా పి.అరుణ్బాబు
సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శిగా ఎం.విజయ సునీత
ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్గా లావణ్య వేణి
రాజమహేంద్రవరం సబ్కలెక్టర్గా మహేశ్కుమార్ రావిరాల