అదేంటి లోకేష్ కి ఆ బాధేం వచ్చింది. ఆయన అడుగేస్తే కారు, విమానం, ఇలా అన్నీ ఉన్న వేళ ఆయనెందుకు పాదం తీయాలి. కదపాలి అన్న డౌట్ రావచ్చు. కానీ ఆయనకు ఇపుడు పాదాలే చాలా ముఖ్యమట. టీడీపీ  పుట్టె మునిగిపోతున్న ఈ టైంలో పాదం కదపకపోతే వర్కౌట్ అయ్యేలా లేదని లోకెష్ అన్నీ బిగించేస్తున్నాడుట.


రంగంలోకి దిగి చకచకా పాదయాత్ర చేస్తాడట. ఎందుకూ అంటే ఈ పాదయాత్ర పార్టీని రక్షించుకోవడానికట. వైసీపీ నేతల చేతుల్లో ఇబ్బందులు పడుతున్న క్యాడర్ ని పరామర్శలు చేయడానికట. మరి జనాలకు లాభమేంటి అంటే ఆ దారిలోనే వస్తూ జనాలను కూడా పలకరిస్తాడు కాబటి ఇది జనం కోసం కూడానట.


మొత్తానికి లోకెష్ కూడా పాదయాత్రకు రెడీ అంటున్నాడట. తన మామ బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం నుంచి లోకేష్ పాదయాత్ర తొందరలోనే మొదలవుతుందని అంటున్నారు. ఈ పాదయాత్రను ఏకబిగిన చేయరట. మెలమెల్లగా చేసుకుంటూ ఆపుకుంటూ ఆలా అయిదేళ్ళూ  బండి లాగిస్తారట. 


దీని వల్ల పేరుకు పేరు, జనానికి దగ్గర కావడం, మరో వైపు కాళ్ళ నొప్పుల తీపి కూడా ఉండదు. ఇలా అన్నీ ఆలోచించే లోకేశం మాస్టర్ ప్లాన్ వేశారట. మరి పాదం ఎపుడు కదుపుతాడో ముహూర్తం పెట్టుకున్నాక చెబుతారట.


మరింత సమాచారం తెలుసుకోండి: