చిన్నపిల్లలు మట్టి తినడం చూశాం.. ఇంకొందరు సుద్దముక్కలు తింటుంటారు. మరికొందరు మరీ విచిత్రంగా ఇసుక కూడా తింటుంటారు. కానీ.. మధ్యప్రదేశ్ లోని యోగిత్ సింగ్ అనే ఓ కుర్రాడు మాత్రం ఏకంగా పెన్నులు, పెన్సిళ్లు, పొడవాటి ఇనుప ముక్కలు కూడా హాయిగా తినేశాడు.


మతిస్థిమితం లేని ఈ కుర్రాడు పెన్నులు, పెన్సిళ్లు, ఇనుప ముక్కలు తినడం ప్రారంభించారు. అంతేకాదు.. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పాడట. మతిస్థిమితం లేదు కదా అబద్దం చెబుతున్నడేమో అనుకున్నారు వారంతా.


కానీ కడుపునొప్పితో యోగిత్ సింగ్ ఆసుపత్రిలో చేరితే కానీ అసలు విషయం వారికి అర్థం కాలేదు. స్కానింగ్ తీసిన వైద్యులకు యోగిత్ కడుపులో ఏకంగా స్టేషనరీ షాపే కనిపించింది. మొత్తం దాదాపు 40 రకాల వస్తువులు కనిపించాయట. ఆపరేషన్ చేసి ఆ వస్తువులను బయటకు తీసిన వైద్యులు.. మీడియా ముందు ప్రదర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: