వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి అసలు కారణం పాదయాత్ర.  పాదయాత్ర చేయడం వలనే అధికారంలోకి వచ్చారు.  ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.  వారి సమస్యలకు హామీలు ఇచ్చారు.  అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను నెరవేర్చేందుకు సిద్ధం అయ్యారు.  


ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు.  కాగా, ఇప్పుడు ఆ జగన్ బాటలోనే నారా లోకేష్ కూడా నడవబోతున్నాడు.  జగన్ పాదయాత్ర చేసినట్టుగా యువనేత లోకేష్ కూడా రాష్ట్రంలో పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారట.  ఎక్కడి నుంచి మొదలుపెట్టబోతున్నారు అనే దానిపై కూడా ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది.  


తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజక వర్గం హిందూపురం.  అక్కడ ఎన్టీఆర్ మూడు సార్లు విజయం సాధించారు.  ఆ తరువాత హరికృష్ణ రెండుసార్లు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టి పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు.  


2014, 2019 ఎన్నికల్లో బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు.  తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న హిందూపురం నుంచి నారా లోకేష్ పాదయాత్ర చేయాలని అనుకుంటున్నారట.  ఈ యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది.  ఎలా ప్రారంభం అవుతుంది అనే విషయాలు త్వరలోనే బయటకు వస్తాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: