వైసీపీ 'ఫైర్ బ్రాండ్' ఎవరు ? అని అంటే నీకు అది కూడా తెలీదా .. రోజా వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా అంటారు. ప్రతిపక్షంలో ఉన్న పాలకపక్షంలో ఉన్న చుక్కలు చూపించే శక్తి కేవలం రోజా కే ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటు చంద్రబాబుకు అటు నారా లోకేష్ కి ప్రతి ఒక్కరికి చుక్కలు చూపించింది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మొదట చంద్రబాబుపై డైలాగ్ లు వేసింది. 


అలాంటి రోజా ఇప్పుడు మౌనం వహిస్తుంది. ఫైర్ బ్రాండ్ అని పేరు వచ్చింది కానీ ఆ పేరు వచ్చాక ఫైర్ బ్రాండ్ లో ఫైర్ మిస్ అయ్యింది అని అంటున్నారు నెటిజన్లు. ఇప్పుడు ఎక్కడికి వచ్చిన ఆమె మాటే ముత్యం అన్నట్టు ప్రవర్తిస్తుంది. అసెంబ్లీలో అన్ని గొడవలు జరుగుతున్న రోజా మాత్రం ఒక్క మాట మాట్లాడటం లేదు. ఆ మౌనం వెనుక ఆమె ఆలోచన ఏంటి ? 


వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆమె అలిగారా ? లేక మౌనం మంచిది అని అనుకుంటున్నారా ? ఏపిఐఐసి చైర్మన్ పదవి దక్కినా ఆమెలో అసంతృప్తి కనిపిస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కంటే రోజాలోనే ఎక్కువ మార్పులు కనిపిస్తున్నాయి. ఎప్పుడు విమర్శించే ఆమె ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తుంది. ఎందుకింత మార్పు? ఆ మార్పు వెనుక అసలు కారణాలు ఏంటి అనేది రోజానే చెప్పాలి.   


మరింత సమాచారం తెలుసుకోండి: