తెలుగుదేశం పార్టీ జాతకాన్ని ఇతర పార్టీల నేతలు చెప్పేయడమే అసలైన విడ్డూరం. పార్టీలో చంద్రబాబు ఇంకా పోరాడుతానని అంటున్నారు. మరో వైపు ట్విట్టర్ పిట్ట లోకేష్ తనకు తోచిన కామెంట్స్  చేసుకుంటూ అదే పాలిటిక్స్ అనుకుంటున్నారు. తమ్ముళ్ళకు ఏమీ అర్ధం కావడంలేదు. ఇంతలో..


ఈ మొత్తం సీన్ ని  వివరిస్తూ ఇతర పార్టీల నేతలు సైకిల్ కి పంచర్లు పడ్డాయని చెప్పేస్తున్నారు. మరిక టీడీపీ కోలుకోవడం కష్టమేనని కూడా అంటున్నారు.  చంద్రబాబు నాయుడు వయసు అయిపోయిందని, ఆయన కుమారుడు లోకేష్ కు వాయిస్ లేదని బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎపిలో తుడిచిపెట్టుకుపోయిందని, టిడిపి కోలుకునే పరిస్థితి లేదని ఆయన అన్నారు.


 ఈ రెండు పార్టీలు ఇక చరిత్రేనని కూడా కన్నా ఘాటు కామెంట్శ్ చేయడం విశేషం. ఈ మొత్తం పరిణామాలను చూసిన తరువాతనే టీడీపీ తమ్ముళ్ళు బీజేపీ వైపు చూస్తున్నారని కన్నా అంటూ  టీడీపీ నేతల్లో ఆత్మస్థైర్యం దెబ్బతిందన్నారు. మొత్తానికి టీడీపీ కి దెబ్బ పడిందో లేదో కానీ కన్నా మాత్రం మేకను కుక్క అంటూ పదే పదే అనడం ద్వారా అదే నిజం చేసేట్టున్నారు. ఇలా చేస్తేనే కదా బీజేపీ గూడు నిండేది మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: