ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమిపాలు కావడంతో ఆ పార్టీ భవితవ్యం అంధకారంలో పడింది. పార్టీ నుంచి వలసలు జోరందుకుంటున్నాయి. మళ్లీ ఎన్నికల వరకూ పార్టీని నడిపించే నాయకుడు ఎవరన్న అంశంపై తెలుగు తమ్ముళ్లు మథనపడుతున్నారు.


ఇక తెలుగుదేశం అధికారం దిశగా అడుగులు వేయడం సంగతి అటుంచి పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు అధికార దర్పంతో వెలిగిపోయిన పార్టీపై ఇప్పుడు ప్రతి ఒక్కరూ సెటైర్లు వేస్తున్నారు. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఘాటైన కామెంట్లు చేశారు.


చంద్రబాబు నాయుడుకు వయసు అయిపోయిందని.... ఆయన కుమారుడు లోకేష్ కు వాయిస్ లేదని పంచ్ డైలాగ్ పేల్చారు. చిత్తూరు జిల్లాలో ఆయన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎపిలో తుడిచిపెట్టుకుపోయిందని, టిడిపి కోలుకునే పరిస్థితి లేదని ఆయనఅంటున్నారు.


టీడీపీ నేతల్లో ఆత్మస్థైర్యం దెబ్బతిందని.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్ బీజేపీకే అనుకూలంగా ఉందని లక్ష్మీనారాయణ అంటున్నారు. మొత్తానికి కమలం పార్టీకి ఏపీపై ఆశలు బాగానే ఉన్నాయన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: