వైసీపీ అధికారంలోకి వచ్చి మరో వారంలో రెండు నెలలు పూర్తి అవుతాయి. ఈ రెండు నెలల్లో జగన్ ఏం చేసారని చెప్పాలంటే చాలనే చేశారు. వరసగా హామీలను ఆయన నెరవెర్చే పనిని శ్రీకారం చుట్టారు. అదే సమయంలో టీడీపీ గత పాలనను తవ్వి  తీసి అవినీతి మూలాలను బయటేస్తున్నారు.


అయితే జగన్ అసలైన పాలన చూడాలంటే మరో రెండు నెలల సమయం పడుతుందని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అంటున్నారు. టీడీపీ చేసిన అవినీతిని బయటకు తీసేసరికే తమకు ఎక్కువ సమయం పడుతోందని ఆయన ఈ రోజు మీడియాతో కడపలో మాట్లాడుతూ చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2. 70 లక్షలో కోట్ల అప్పులను ప్రజలపై మోపిందని, మరో లక్ష కోట్ల బిల్లులు చెల్లించకుండా పెండింగులో పెట్టిందని ఆయన చెప్పారు


దాంతో అప్పుల కుప్పగా రాష్ట్రం తయారైందని ఆయన అన్నారు. ఇవన్నీ సరిదిద్ది పాలన గాడిలో పడాలంటే మరో రెండు నెలల సమయం అవసరం అవుతుందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కాగా తాము చెప్పిన అన్ని హామీలను తప్పకుండా నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. జగన్ మార్క్ పాలనను రానున్న రోజుల్లో చూస్తారని ఆయన చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: