అవును ఏపీ సీఎం జగన్.. ప్రజలను మోసం చేస్తున్నారట.. సాధ్యం కాదని తెలిసీ ప్రజలను భ్రమల్లో ఉంచుతున్నారట.. ఈ మాటలు చెబుతున్నది మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి.


ఇంతకీ విషయం ఏమిటంటారా.. అదే ప్రత్యేక హోదా విషయం. ఏపీకి ప్రత్యేకహోదా సాధ్యం కాదని కేంద్రం ఇప్పటికే క్లారిటీ ఇచ్చేంసిందని ఆమె ఇటీవల పదే పదే చెబుతున్నారు. అయినా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని పురందేశ్వరి విమర్శించారు.


ప్రత్యేకహోదా విషయంలో ముఖ్యమంత్రి జగన్ వైఖరి సరికాదని ఆమె గుంటూరు జిల్లాలో వ్యాఖ్యానించారు. నిజమే.. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చాలాసార్లు చాలా క్లియర్ గా చెప్పేసింది. కానీ సదరు కేంద్ర మంత్రి గమనించాల్సింది ఏమంటే.. ఈ విషయంలో జగన్ కూడా క్లియర్ గానే ఉన్నాడు.


మోడీ బంపర్ మెజారిటీతో ప్రధాని అయ్యాక ప్రత్యేక హోదా తెస్తానని జగన్ ఎక్కడా నమ్మకంగా చెప్పడం లేదు. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ప్రధానిని హోదా గురించి అడుగుతాం.. అడుగుతూనే ఉంటాం.. అని మాత్రమే చెబుతున్నారు. అంటే పరోక్షంగా ప్రజలను హోదా రాదని మానసికంగా సిద్ధం చేసేశారు. మరి ఇందులో జగన్ చేసే మోసం ఏముంది..?


మరింత సమాచారం తెలుసుకోండి: